Thirunallar Shani Temple: తిరునల్లార్ శని దేవాలయం – దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం, నల పుష్కరిణి మహత్యం, పూజోత్సవాలు
తిరునల్లార్ శని దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. రెండు నదుల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో శని దేవునితో పాటు పరమ శివుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శని దేవుని స్థానం (గోచారం) మారిన సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏలినాటి శని బాధలతో బాధపడేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే ఉపశమనం కలుగుతుందని అనేక మంది నమ్ముతారు.
దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్ర మహిమ
అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ఈ తిరునల్లార్ శని దేవాలయాన్ని దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయాన్ని తొలుత చోళ రాజులు అభివృద్ధి చేయగా, తరువాతి కాలంలో అనేక మంది రాజులు విస్తరించారు. ఆలయంలో ఉన్న శాసనాలు ఈ విషయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
శివ – పార్వతుల ఆలయం
సంవత్సరం పొడవునా విశేష పూజలు, ఉత్సవాలతో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది.
ఆలయ స్థల పురాణం
కొన్ని రోజుల తరువాత ఆలయ అధికారి ఒకరు, ఆ పాలను శివాలయంలో కాకుండా తన ఇంట్లో పోయమని గొల్లవానిని బెదిరించాడట. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు. భయంతో గొల్లవాడు అదే విధంగా చేయసాగాడు.
ఈ సంఘటన కారణంగా ఆలయంలోని బలిపీఠం కొద్దిగా పక్కకు జరిగినట్లు చెబుతారు. నేటికీ అది అలాగే ఉండి ఆ అద్భుత ఘటనకు సాక్ష్యంగా నిలుస్తోంది.
నల పుష్కరిణి మహత్యం
విదర్భ చక్రవర్తి భీముని కుమార్తె దమయంతి అపురూపమైన సౌందర్యవతి. అనేక దేవతలు, రాజులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నా, ఆమె నల మహారాజునే వరించింది.
ఈ వివాహం నచ్చని కొందరు దేవతలు, నలుడిని కష్టాల్లో పడేయమని శని దేవుని ప్రార్థించారట. శని ప్రభావంతో నల మహారాజు రాజ్యాన్ని కోల్పోయి, సంపదలు, బంధువులు, చివరకు భార్య దమయంతి కూడా దూరమయ్యారు.
అందుకే ఈ పుష్కరిణిని ‘నల తీర్థం’ అని పిలుస్తారు.
శని ప్రభావం లేని శని ఆలయం
ఈ క్షేత్రంలో శని దేవుని శక్తులను పరమశివుడు నియంత్రించాడని స్థల పురాణం చెబుతుంది. అందుకే దేశంలో అనేక శని ఆలయాలు ఉన్నప్పటికీ, ఈ ఆలయంలో శని ప్రభావం భక్తులపై పడదని విశ్వాసం.
ఇక్కడ శని దేవుడు పరమశివునికి ద్వారపాలకుడిగా ఉంటాడు. భక్తులు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పూజల అనంతరం కాకులకు అన్నం సమర్పించడం వంటి ఆచారాలు పాటిస్తారు.
పూజలు – ఉత్సవాలు
ఎలా చేరుకోవాలి

Comments
Post a Comment