Srinivasa Mangapuram Temple: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ప్రత్యేక కార్యక్రమాలు 2025

 

కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 30, 31 తేదీలలో జరగబోయే ముఖ్య కార్యక్రమాలు మరియు దర్శన సమయాల వివరాలు:

వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30)

ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. వేకువజామున పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

TimeEvent
12:05 AM to 2:30 AMధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం
2:30 AM to 4:00 PMభక్తులకు సర్వదర్శనం (ఉత్తర ద్వార దర్శనం)
4:00 PM to 5:00 PMరాత్రి కైంకర్యాలు
5:00 PM to 9:00 PMభక్తులకు తిరిగి దర్శనం

వైకుంఠ ద్వాదశి (డిసెంబర్ 31)

వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి.

TimeEvent
ఉదయం 4:00 నుండి 5:30 వరకుధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం
ఉదయం 6:00 నుండి 7:00 వరకుతిరుచ్చి ఉత్సవం
ఉదయం 8:30 నుండి 9:30 వరకుచక్రస్నానం (చక్రత్తాళ్వార్కు పవిత్ర స్నానం)

ఆంగ్ల నూతన సంవత్సరాది (జనవరి 1, 2026)

నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాలను పొడిగించారు

సమయంనిర్వహించే కార్యక్రమం
వేకువజామున 1:00 నుండి 4:00 వరకుధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం
వేకువజామున 4:00 నుండి సాయంత్రం 4:00 వరకుభక్తులకు నిరంతర సర్వదర్శనం
సాయంత్రం 4:00 నుండి 5:00 వరకురాత్రి కైంకర్యాలు
సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:30 వరకుభక్తులకు తిరిగి దర్శనం

ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని ఆలయంలో ఆధ్యాత్మిక మరియు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ మరియు అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

Comments

Popular Posts