సుచీంద్రం ఆంజనేయ స్వామి ఆలయం – త్రిమూర్తుల లింగరూపం, వెన్నపూస సంప్రదాయం ప్రత్యేకతలు
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని ప్రసిద్ధ దైవక్షేత్రం సుచీంద్రం. ఈ క్షేత్రం శైవ–వైష్ణవ–స్మార్త సంప్రదాయాల సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది.
త్రిమూర్తులు ఒకే లింగరూపంలో
సుచీంద్రంలోని శివాలయంలో త్రిమూర్తులు ఒకే లింగరూపంలో వెలసి ఉండడం ఈ క్షేత్ర విశిష్టత. స్థలపురాణం ప్రకారం—
-
లింగం పైభాగంలో విష్ణుమూర్తి,
-
మధ్యభాగంలో శివుడు,
-
క్రిందిభాగంలో బ్రహ్మదేవుడువెలసి ఉన్నట్లు విశ్వసిస్తారు. ప్రపంచంలోనే అరుదైన ఈ దర్శనం భక్తులకు మహా పుణ్యప్రదంగా భావించబడుతుంది.
ఇంద్రునికి శాపవిమోచనం
18 అడుగుల హనుమాన్ విగ్రహం
ఈ మహిమాన్విత క్షేత్రంలో 18 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ విగ్రహాన్ని సంపూర్ణంగా దర్శించాలంటే కొంత దూరం వెళ్లి చూడాల్సి వస్తుంది. అంతటి మహిమ కలిగిన స్వామిగా హనుమంతుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు.
హనుమ తోకకు వెన్నపూస – విశిష్ట సంప్రదాయం
సాధారణంగా హనుమంతుడికి సింధూరం, తమలపాకులు సమర్పిస్తారు. కానీ సుచీంద్రంలో భక్తులు స్వామివారి తోకకు వెన్నపూస రాయడం అనే అపూర్వ సంప్రదాయాన్ని పాటిస్తారు.
హనుమ తోకకు నిప్పు పెట్టిన రాక్షసులు
రామాయణంలోని సుందరకాండలో, సీతమ్మను దర్శించిన హనుమను రాక్షసులు బంధించి రావణాసురుని సభకు తీసుకువెళ్తారు. దూతను చంపడం అధర్మమని భావించిన రావణుడు, హనుమ తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు.
లంకా దహనం
హనుమకు హాని కలగకుండా ఉండేందుకు సీతమ్మ అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. అగ్నిదేవుని అనుగ్రహంతో హనుమకు ఎలాంటి బాధ కలగదు. అనంతరం హనుమ తన తోకతో లంకానగరాన్ని దహనం చేస్తాడు.
Post a Comment