చైత్ర మాసంలో రామాయణ ఘట్టాలు – జననం నుంచి అయోధ్య చేరిక వరకు



భారతీయ సనాతన సంప్రదాయంలో చైత్రమాసం అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా రామాయణం లోని అనేక కీలక సంఘటనలు ఈ మాసంలోనే జరిగినట్లు పురాణాలు తెలియజేస్తాయి. ఈ మాసం శ్రీరాముని జీవితంలో కీలక మలుపులకు సాక్ష్యంగా నిలుస్తుంది.

శ్రీరామ జననం

చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు అవతరించాడు. ఈ రోజునే మనం శ్రీరామనవమిగా ఘనంగా జరుపుకుంటాం.

అహల్య శాప విమోచనం

గౌతమ మహర్షి శాపంతో శిలగా మారిన అహల్యను శ్రీరాముడు తన పాదస్పర్శతో విముక్తి కలిగించాడు. ఈ పవిత్ర సంఘటన కూడా చైత్రమాసంలోనే జరిగినట్లు చెబుతారు.

వనవాస ప్రారంభం

అయోధ్యను విడిచి, ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినది కూడా ఈ మాసంలోనే.

గుహుడి సహాయం

అరణ్యవాసంలో గుహుడు సహాయంతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణులు గంగానదిని దాటిన ఘట్టం చైత్రమాసంలో జరిగింది.

దశరథ మహారాజు మరణం

దశరథ మహారాజు తన కుమారుడి వియోగాన్ని తట్టుకోలేక ఈ మాసంలోనే పరమపదించారు.

సీతాదేవి అపహరణ

రావణుడు సీతాదేవిని అపహరించిన సంఘటన కూడా చైత్రమాసంలోనే చోటుచేసుకున్నదిగా పురాణాలు చెబుతున్నాయి.

విభీషణ పట్టాభిషేకం

లంకలో ధర్మాన్ని స్థాపిస్తూ విభీషణుడు కు శ్రీరాముడు పట్టాభిషేకం చేసిన ఘట్టం కూడా ఈ మాసానికే చెందినది.

అయోధ్యకు తిరిగి చేరిక

రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి చేరినదీ చైత్రమాసంలోనే జరిగిన మహత్తర సంఘటన.

Comments