Korukonda Lakshmi Narasimha Swamy Temple: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు 2026 షెడ్యూల్
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆగమ, వేద పండితులు మరియు దేవస్థాన అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో జరిగే ఈ వార్షిక ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు.
2026 ఉత్సవ కార్యక్రమాలు
ఫిబ్రవరి 26
పుట్టమన్ను తెచ్చే కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం అంకురార్పణ, ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 27
భక్తుల మధ్య వైభవంగా రథోత్సవం జరుగుతుంది. అదే రోజు స్వామివారి దివ్య కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 28
గరుడవాహనంపై స్వామివారు గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తారు.
మార్చి 1
పండిత సదస్సు నిర్వహించబడుతుంది. అనంతరం ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
మార్చి 2
అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు రంగనాథస్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది.
మార్చి 3
చక్రతీర్థ స్నానం, ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం శేషవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
మార్చి 4
ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించి, శ్రీపుష్పయాగంతో మహోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

Post a Comment